ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలతో పాటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెలాఖరులో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 27, 29న పోలింగ్ జరగనుందిఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో సర్పంచ్లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించనుంది. ఏకగ్రీవమైతే గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నజరానా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ప్రతి పాదనలను పంచాయతీరాజ్శాఖ ప్రభుత్వానికి పంపింది. రెండు రోజుల్లో జీవో సైతం వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా పార్టీ రహితంగా జరుగునున్నాయి. అందుకే ప్రభుత్వం ప్రోత్సహకాలను ప్రకటించింది.
ఎన్నికలవేళ జగన్ సర్కార్ బంపరాఫర్.. ఏకంగా రూ.5లక్షలు, రూ.20లక్షలు